News

వారికి కావలసిన వ్యక్తిగానే ఉంటాను


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరు కాలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని ఆయన చెప్పారు.వారిద్దరికీ నేను ఆమోద యోగ్యమైన గవర్నర్‌నే. హైదరాబాద్‌లో వున్న చివరిరోజు వరకు వారికి కావలసిన వ్యక్తిగానే ఉంటాను’ అని నరసింహన్ అన్నారు. తాను ఆశావాదినని,అయితే ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద తన మనవడు అలిగాడని ఆయన సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. పరిస్థితులన్నీ కాలానుగుణంగా చక్కబడుతాయని ఆయన అన్నారు.